టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా కొనసాగుతున్న వారిలో ముందుకు వరుసలో ఉన్న హీరోలు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. రాజకుమారుడు మూవీ తో మహేష్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తో పవన్ కళ్యాణ్ హీరోలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అక్కడి నుండి తమ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ప్రస్తుతం ఒకరిని మించేలా మరొకరు భారీ క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ తో దూసుకెళ్తున్నారు.

ఇక ఈ ఇద్దరికీ కూడా దాదాపుగా అన్ని ఏరియాల్లో సమాన స్థాయి మార్కెట్ ఉండడం విశేషం. ఇక ఈ ఇద్దరు గతంలో పలు సందర్భాల్లో తమ తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు. అయితే వాటిలో కొన్ని సార్లు మహేష్, మరికొన్ని సార్లు పవన్ కళ్యాణ్ విజేతలుగా నిలిచారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే దాదాపుగా కొన్నేళ్ల తరువాత అతి త్వరలో మరొక్కసారి ఈ ఇద్దరు బడా స్టార్స్ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కేవలం కొద్దిరోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్నట్లు టాక్. ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్సకత్వంలో 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ సర్కారు వారి పాట లో నటిస్తున్నారు మహేష్. 

మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు ఇటీవల యూనిట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ చేస్తున్న సినిమా కూడా సరిగ్గా అదే సమయానికి రిలీజ్ కానున్నట్లు టాక్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రకటించనున్నారు. కాగా అదే రోజున ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ కానున్నట్లు టాక్. మరి ఈ మూవీ నిజంగానే సంక్రాంతికి రిలీజ్ అయితే ఈ ఇద్దరి మధ్య అతి పెద్ద బాక్సాఫీస్ పోరు తప్పదనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: