గత కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సతమతం అయిన మాస్ మహారాజ రవితేజ కి ఎట్టకేలకు ఇటీవల గోపీచంద్ మలినేని దర్సకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచి పెద్ద బ్రేక్ ని అందించింది. రవితేజ, పోతురాజు వీరశంకర్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై దీనిని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మంచి మాస్ అంశాలతో పాటు పలు కమర్షియల్ హంగులు, కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా దర్శకుడు గోపీచంద్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రవితేజ అద్భుతమైన పెర్ఫార్మన్స్, దర్శకుడు గోపీచంద్ అత్యద్భుతమైన టేకింగ్, శృతి హాసన్ యాక్షన్, అందం, ముఖ్యంగా థమన్ అందించిన సాంగ్స్, వండర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాతల భారీ నిర్మాణ విలువలు, అలానే ముఖ్య పాత్రల్లో నటించిన సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ల ఆకట్టుకునే నటన వెరసి క్రాక్ మూవీని సూపర్ సక్సెస్ చేసాయి. 

ఇక ఇప్పటికీ కూడా అక్కడక్కడా కొన్ని థియేటర్స్ లో ఈ మూవి మంచి కలెక్షన్స్ తో సాగుతున్నట్లు టాక్. అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీని ఇటీవల ప్రముఖ ఒటిటి మాధ్యమం ఆహా వారు ప్రసారం చేయగా ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా 250 మిలియన్ల నిమిషాల వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డుని నమోదు చేసిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటివరకు అటు థియేటర్స్ లో అదరగొట్టిన క్రాక్ మూవీ ప్రస్తుతం ఓటిటి లో కూడా భారీ స్థాయి వ్యూస్ తో ర్యాంప్ ఆడిస్తోందని, చూస్తుంటే ఈ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూస్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: