నాని అన్ని సినిమాలు ఎలాంటి గొడవలు లేకుండ విడుదలవుతాయి. జయపజయలతో పక్కన పెడితే ఏ సినిమా మీద కానీ ఇప్పటిదాకా ఒక్క గోడవలేదు. అయితే నాని,  సుధీర్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వి గురించి తెలిసిందే . కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశాడు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ప్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమా మీద చాలా కామెంట్స్ కూడా చేసారు. ఇక ఇది ఇలా ఉంటే  మోహనక‌ృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఓ సీన్ లో మోడల్, నటి సాక్షి మాలిక్ ఫోటోను ఆమె అనుమతి లేకుండా వాడటంతో బాంబే హైకోర్టు వి సినిమాను వెంటనే అమెజాన్ ప్రైమ్ నుంచి తొలగించాలనీ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే వి సినిమాలో ఓ సన్నివేశంలో సెక్స్ వర్కర్‌గా తన ఫోటోను చూపించారని.. నటి సాక్షి మాలిక్ బాంబే కోర్టులో కేస్ వేసింది. తన అనుమతి తీసుకోకుండా వి టీం ఇలా చేసినందుకు ఆమె చిత్ర నిర్మాతలపై పరువునష్టం కేసు వేసింది. కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా తన ఫొటోను చూపించారని, అనుమతి లేకుండా ఆ ఫొటోను వాడి తన పరువుకు భంగం కలిగించారని సాక్షి మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేస్ ని విచారణ జరిపిన బాంబే కోర్ట్ ఇది కచ్చితంగా పరువు నష్టం కలిగించే అంశమేనని అన్నారి. అందులో భాగంగా కోర్టు తీర్పు నిస్తూ.. ఓటీటీ నుంచి ఆ సినిమాను వెంటనే తొలగించాలని ఆదేశించింది.ఇక ఈ గొడవ గురించి మూవీ టీం ఇంకా నోరు విప్పలేదు. ఇక నాని తను న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టు శ్యామ్‌ సింగ‌రాయ్‌ షూటింగ్ లో ఉన్నారు . రాహుల్ సంకీర్త్య‌న్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీలో కృతిశెట్టి, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: