పూర్ణ అనే స్టేజ్ నేమ్ తో సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయిన నటీమణి షమ్నా కాసిమ్ శ్రీమహాలక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆమె మొదట్లో ఎక్కువగా మలయాళం సినిమాలు చేశారు. తదనంతరం తమిళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించారు. 2011 సంవత్సరంలో సీమటపాకాయ్ సినిమాలో కనిపించి మెప్పించారు. మళ్లీ 2012లో అవును సినిమాతో ఆమె టాలీవుడ్ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ సినిమాలో ఆమె బాగా ఎక్స్పోజింగ్ చేసి కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తగ్గడంతో ఆమెను మరిన్ని తెలుగు సినిమా అవకాశాలు వరించాయి.


ఐతే ఇటీవల విడుదలైన పవర్ ప్లే సినిమాలో ఆమె సీఎం కూతురు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతున్నారు. చాలా అందంగా, అమాయకంగా కనిపించే పూర్ణ ఈ సినిమాలో నెగటివ్ పాత్రను చాలా చక్కగా పోషించి తనలోని అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అయినా ఆమెకు మాత్రం కెరీర్ పరంగా మేలే చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నాయని సినీ వర్గాల సమాచారం.


ఇకపోతే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పద్మావతి అనే ఒక కీలక రోల్ లో పూర్ణ నటిస్తున్నారు. ఈమె జయలలిత బయోపిక్ అయిన తలైవి లో శశికళ పాత్ర పోషించారు. వెంకటేష్ హీరోగా నటిస్తున్న దృశ్యం 2 మూవీ లో కూడా ఈమె ఒక అతిథి పాత్రలో నటించనున్నారు. సుందరి, బ్యాక్ డోర్, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ వంటి చిన్నపాటి సినిమాల్లో ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అలాగే ఆమె మలయాళం 1, కన్నడ 1.. తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత ఈ కేరళ కుట్టి ఒకవైపు టీవీ ప్రోగ్రాములతో, మరొకవైపు చాలా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: