ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న కాంబినేషన్ రామ్ చరణ్, శ్రీనువైట్ల. ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ పై ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ మూవీకి సంబంధించిన శాటిలైట్ బిజినెస్ సైతం హాట్ టాపిక్ గా నిలిచింది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఎంతటి స్టార్ హీరో మూవీ అయినా సరే, రష్ ని చూసిన తర్వాతే, ఆ మూవికి సంబంధించిన టాక్స్ బయటకు వస్తాయి. కాని రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇంకా 50 శాతం కూడ పూర్తి కాకపోయినా, ఆ మూవీకి సంబంధించిన ఎటువంటి టాక్స్ తో సంబంధం లేకుండానే, జీ నెట్ వర్క్ శాటిలైట్ రైట్స్ కి సంబంధించిన బిజినెస్ ని క్లోజ్ చేసింది.

ఈ న్యూస్ టాలీవుడ్ లోని టాప్ హీరోలకి సైతం హాట్ టాక్స్ గా నిలిచింది. రామ్ చరణ్ తన 9వ సినిమా షూటింగ్ శ్రీను వైట్ల డైరెక్షన్లో చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ 40%పూర్తయ్యింది. కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. జీ తెలుగు వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని 13 కోట్లకి కొనుక్కున్నారు.

ఈ 13 కోట్లకి శాటిలైట్ తో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా జీ వారు తీసుకున్నారు. రామ్ చరణ్ తో మొదటి సారి రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కడుతున్న ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: