సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ప్రాణం ఖరీదు సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పునాదిరాళ్లు, మన ఊరి పాండవులు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న చిరంజీవి అనంతరం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు అవకాశాలు అందుకుని ముందుకుసాగారు. ఇక కెరీర్ పరంగా చిరంజీవికి అతి పెద్ద బ్రేక్ నిచ్చిన సినిమా ఖైదీ. అప్పట్లో కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ తర్వాత చిరంజీవి హీరోగా గొప్ప క్రేజ్ దక్కించుకుని వేగవంతంగా సినిమా అవకాశాలతో ముందుకు దూసుకెళ్లారు.

ఆ పై సుప్రీం హీరోగా అప్పటి యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్న చిరంజీవి అనంతరం ఎన్నో మెగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మెగాస్టార్ గా అత్యద్భుతమైన క్రేజ్ పాపులారిటీ మార్కెట్ ని దక్కించుకున్నారు. ఇక ఆ సమయంలో చిరంజీవి సినిమా వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అభిమానులు హడావుడి అంతా ఇంతా ఉండేది కాదు.  ఇక మాస్ ఆడియన్స్, యువత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా టాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న చిరంజీవి ఇటీవల కొన్నాళ్ళ పాటు రాజకీయాల్లో కొనసాగి ఆపై మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత మరొక మూవీస్ ను కూడా లైన్ లో పెట్టారు.

అయితే చిరంజీవి తర్వాత ప్రస్తుత తరం హీరోల్లో ఎవరు నెంబర్ వన్ అనే విషయమై మాత్రం ఇప్పటికీ కూడా తేలకపోవడంతో కొందరు ప్రేక్షకాభిమానులు ఈ విధంగా స్పందిస్తున్నారు. నిజానికి చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఉన్న వారిలో నెంబర్ వన్ స్థానానికి చాలా దగ్గరగా ఉన్నారని, అలానే మిగతా ఇతర హీరోలు కూడా కొన్ని సందర్భాల్లో మంచి హిట్స్ తో ముందుకు వచ్చినప్పటికీ ఓవరాల్ గా చిరంజీవి స్థానాన్ని అయితే అందుకోలేక పోతున్నారని , నిజానికి అది అంత సులభం కాదని ఒకరకంగా వీరందరూ పాసింగ్ క్లౌడ్స్ వంటివారిని అప్పట్లో ఎన్టీఆర్, ఆ తర్వాత కృష్ణ, ఆపై చిరంజీవి వంటి దిగ్గజ నటులు ఆకాశం వంటివారిని, వారి ఇమేజ్ కి ఆకాశమే హద్దని, అలానే పేరు ప్రఖ్యాతల్లో వారికి వారే సాటి అని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: