ప్రియమణి.. అందంతో పాటు మంచి అభినయం ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరుథి వీరన్‌ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తెలుగులో నాగార్జున, ఎన్టీఆర్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోల సరసన నటించింది.హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది.


మూవీస్‌తో పలు వెబ్‌ సీరీస్‌లలో కూడా నటిస్తుంది.వీటితో పాటు పాటు బుల్లితెరపై ఓ డ్యాన్స్‌ షోకు న్యాయ నిర్ణేతగా కూడా చేస్తుంది. ఇక ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా  ఉంటుంది  ఈ ముద్దు గుమ్మ.టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. త్వరలోనే వెంకటేష్ ‘నారప్ప’ మూవీతో పలకరించనుంది. ఈ సినిమా మే 14న విడుదల కానుంది. నారప్ప సినిమా విషయానికి వస్తే...


వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. సురేశ్‌ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. చిత్రనిర్మాతలు డి. సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను మాట్లాడుతూ– ‘నారప్ప’ సినిమా లాక్‌డౌన్‌కు ముందే 60 రోజులపాటు షూటింగ్‌ జరుపుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ మధ్యే షూటింగ్‌ను హైదరాబాద్‌లో పునః ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్‌ కనకాల తదితరులు పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలతో పాటు కై్లమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం సినిమా పూర్తవుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాం’’ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: