తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లది అద్భుతమైన స్నేహాం. దాదాపుగా ఇద్దరి సినీ ప్రస్థానం ఒకేసారి మొదలైంది. 1975లో మోహన్ బాబు స్వర్గం నరకం మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయితే చిరంజీవి 1978లో ప్రాణం ఖరీదు మూవీతో తెరంగేట్రం చేశారు.

ఈ ఇద్దరూ తరువాత కాలంలో హీరోలుగా కలసి నటించారు. బిల్లా రంగా, పట్నం వచ్చిన పత్రివ్రతలు వంటి చిత్రాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. అదే ఊపులో ఈ ఇద్దరు హీరోలను కలిపి ఒక మూవీ తీయాలని నటుడు, నిర్మాత గిరిబాబు భావించారుట. అందుకోసం ఆయన మంచి స్క్రిప్ట్ ని కూడా రెడీ చేసుకుని మరీ ఇద్దరినీ కలిస్తే ఇద్దరూ ఓకే చెప్పారుట.
అయితే ఈ మూవీలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉన్నా కూడా చిరంజీవి పాత్రకు ఒక డ్యూయెట్ ఉంటుందిట. దాంతో తనకూ ఒక డ్యూయెట్ కావాలని మోహన్ బాబు కోరడంతో సినిమా  కధకు అడ్డంగా ఉంటుందని ఆ డ్యూయెట్ కి గిరిబాబు నో చెప్పారుట. దాంతో ఆ మూవీ చేసేది లేదంటూ మోహన్ బాబు తప్పుకున్నారు.

దాంతో ఈ మూవీని సుమన్, భానుచందర్ హీరోలుగా పెట్టి మెరుపుదాడి పేరు తో తీస్తే బొమ్మ సూపర్ హిట్ అయిందిట. ఈ మూవీ కంటెంట్ బాగుండడంతో చిరంజీవి తాను చేయలేకపోయినందుకు బాధపడ్డారుట. మోహన్ బాబు కూడా ఈ మూవీ హిట్ కావడం చూసి మంచి మూవీ మిస్ అయింది అనుకున్నారుట. మొత్తానికి  చిరు మోహన్ బాబు కాంబోలో రావాల్సిన  మల్టీస్టారర్ అలా ఆగిపోయింది అన్న మాట. ఈ విషయాలను తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో గిరిబాబు చెప్పడం విశేషం. ఏది ఏమైనా మోహన్ బాబు తనదైన పంధాలో సూపర్ హిట్లు ఇచ్చారు. ఇక మెగాస్టార్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇప్పటికీ నాటౌట్ అంటున్నారు. ఇపుడు కూడా ఈ ఇద్దరూ నటిస్తున్నందువల్ల ఫ్యూచర్ లో వీరి కాంబోలో ఏదైనా మూవీ వస్తుందేమో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: