సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి పై అందరి దృష్టి ఉంది.. ఇప్పటికే రెండు బ్రేక్ అప్ లతో వార్తల్లో నిలిచినా నయనతార ఈ సారైనా కోరుకున్నవాడిని పెళ్లాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మొదట కోలీవుడ్ స్టార్ శింబు తో ప్రేమాయణం నడిపిన నయన ఆ తర్వాత ఎందుకో ఆయనతో అనుబంధాన్ని కొనసాగించలేకపోయింది.. కొన్నాళ్లకే ఆయనతో బ్రేక్ అప్ చెప్పుకుని సినిమాలు చేస్తూ వచ్చింది. అలా ప్రభుదేవా తో మరికొన్ని రోజులు డేటింగ్ చేసింది..

అతనితోనూ కొన్ని వేరే కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. నిజానికి ప్రభుదేవా తో పెళ్లి వరుకు వెళ్ళింది నయన్, వాస్తవానికి క్రిస్టియన్ అయిన నయనతార ప్రభుదేవా కోసం హిందువు గా మారింది, ప్రభుదేవా చెప్పినట్టు గానే పెళ్లి తర్వాత సినిమాలు కూడా మానేస్తాను అని చెప్పింది నయనతార, అప్పట్లో తెలుగు లో ఆమె చేసిన శ్రీరామ రాజ్యం సినిమానే ఆఖరి సినిమాగా ప్రకటించింది.  రేపో మాపో పెళ్లి జరగబోతుంది అని అందరూ అనుకుంటున్న సమయం లో ప్రభుదేవా తో కూడా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది,

ఇప్పుడు దర్శకుడు విగ్నేష్ లో లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది నయన్.. గత కొన్ని రోజులుగా వారు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. ఈమధ్యే ఎంగేజ్మెంట్ కూడా అయిపొయింది.. త్వరలోనే పెళ్లి అనుకున్నారు.. డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే సడెన్ గా నయన్ ఓ ట్విస్ట్ ఇచ్చింది.  ఏడాది ఎలాగైనా వివాహం చేసుకోవాలని విఘ్నేష్ శివన్‌‌తో పాటు ఆయన ఫ్యామిలీ ఫిక్స్ అయ్యారట. కానీ నయన్ మాత్రం అందుకు సిద్ధంగా లేదని, కరోనా ఎఫెక్ట్ తగ్గాక వచ్చే ఏడాది వరకు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిందని టాక్. పెళ్లి వాయిదా వేసుకుందామనే విషయాన్ని ఆమె విఘ్నేష్ కుటుంబంతో చెప్పిందని, విఘ్నేష్ కూడా అందుకు ఓకే చెప్పాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: