తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రాజ్ తరుణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యాడు రాజ్ తరుణ్. ఆయన సినిమా చూపిస్తా మామ, కుమారి 21 ఎఫ్, వరుస మూడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరవాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి

ఇండస్ట్రీలో హీరోగా తనదైన శైలిలో గుర్తింపు పొందిన రాజ్ తరుణ్ మే 12, 1992లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జన్మించారు. ఆయన తండ్రి బసవరాజు బ్యాంకులో ఉద్యోగి. తల్లి గృహిణి. రాజ్ తరుణ్ విశాఖపట్నంలో ఇంటర్ పూర్తి చేసుకొని ఎంసెటలో మంచి ర్యాంకును సాధించాడు. ఎంవీజీఆర్ కాలేజ్ లో 6నెలలు కాలేజికి వెళ్లి చదువు మానేశాడు.

ఇక స్కూల్ డేస్ లో కాలికి దెబ్బ తగలడంతో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రోజుకి 3 సినిమాలు చూసేవారు. సినిమాలోని పాత్రలు, దర్శకత్వం ఆసక్తి ఏర్పడింది. 8వ క్లాస్ నుంచే సినిమాలు చూడటం, బుక్స్, డైలాగ్స్ రాయడం మొదలు పెట్టాడు. తనే దర్శకుడిగా మారి ఎన్నో షార్టుఫిల్మ్ లో నటించడం, దర్శకత్వం వహించాడు. ఇంటర్ పూర్తి అయ్యే నాటికి 50 వరకు షార్ట్ ఫిల్మ్ లు నిర్మించాడు.

కెరీర్ పూర్తిగా ముగింపు దశలో ఉన్నప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా రావడంతో కనీసం రాజ్ తరుణ్ మళ్లీ హిట్ కొట్టి తనను తాను నిరూపించుకుంతాడని ఆశించారు అభిమానులు. జి ఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. ఇలాంటి సమయంలో కూడా మరో సినిమా అవకాశం అందుకున్నాడు రాజ్ తరుణ్. ఒరేయ్ బుజ్జిగాడా సినిమాతో మళ్ళి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత రాజ్ తరుణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: