వైష్ణవ్ తేజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే చిత్ర సీమలో సంచలనాలు సృష్టించాడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా తన టాలెంట్‌తో అందరినీ మెప్పించాడు. తన తొలి సినిమాతోనే వైష్ణవ్ 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఉప్పెనతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన తొలి సినిమా విడుదల కాకముందే క్రిష్ వంటి అగ్ర దర్శకుడి దగ్గర ఛాన్స్ కొట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తన రెండో సినిమాను చేశాడు. ఇందులో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.


అయితే ఉప్పెన సినిమాతో స్టార్ హోదాను అందుకున్న వైష్ణవ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. క్రిష్‌తో చేసిన సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు వైష్ణవ్ పచ్చజెండా ఊపాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రూపొందనున్న సినిమాకు అక్కినేని నాగార్జున ఓ కొత్త దర్శకుడిని ఓకే చేశాడు. వీరి కాంబోలో రానున్న సినిమా అందరినీ మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.



ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైష్ణవ్ నటిస్తున్న సినిమాపై తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో వైష్ణవ్ సరికొత్తగా కనిపించనున్నాడని,  ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాను పృథ్వీ అనే కొత్త దర్శకుడు చేయనున్నాడు. ఇది హాకీ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని లాక్‌డౌన్ అనంతరం పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే వైష్ణవ్ స్పోర్ట్స్ జానర్‌లోనూ అదరగొడతాడని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఈ సినిమాతో వైష్ణవ్ వారి అంచనాలను అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: