ఇప్పటికే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు మన దేశం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రోజు రోజుకు ప్రతి రాష్ట్రంలో కూడా వేలాదిగా కేసు లు నమోదవుతుండడంతో ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు విధిస్తూ ప్రజలను ఎక్కువగా ఇంటి నుండి బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం చేస్తున్నాయి. మరోవైపు పలు రంగాలు మళ్ళి మూతబడి నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దానితో ఎందరో ప్రజలు చేయడానికి పనుల్లేక, తినడానికి సరైన తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరోనా పాజిటివ్ వ్యాధి సోకి ఇబ్బందుల పడుతున్న వారి పరిస్థితి అయితే వర్ణనాతీతం. అయితే ఈ వ్యాధి సోకినా వారిలో అత్యధికులు కోలుకోవడం ఇక్కడ ఊరటనిచ్చే విషయం అని చెప్పాలి.  

ఆ విధంగా ఈ మహమ్మారి మన దేశాన్ని, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అవసరం అయితే తప్ప బయటకు రావద్దని పలువురు అధికారులు, ఆరోగ్య నిపుణులు ప్రజలను కోరుతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు.

మరోవైపు పలువురు ప్రముఖులు, నటులు, అధికారులు వ్యాక్సిన్ లు తీసుకుంటూ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో గల అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు వ్యాక్సిన్ లు తీసుకోగా నేడు కొద్దిసేపటి క్రితం స్టార్ హీరోయిన్ నయనతార, తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అందరూ ఎటువంటి భయంలేకుండా హ్యాపీగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రజలని కోరారు నయనతార. ఇక ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది ... !!

మరింత సమాచారం తెలుసుకోండి: