ఆ విధంగా ఈ మహమ్మారి మన దేశాన్ని, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అవసరం అయితే తప్ప బయటకు రావద్దని పలువురు అధికారులు, ఆరోగ్య నిపుణులు ప్రజలను కోరుతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు.
మరోవైపు పలువురు ప్రముఖులు, నటులు, అధికారులు వ్యాక్సిన్ లు తీసుకుంటూ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో గల అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు వ్యాక్సిన్ లు తీసుకోగా నేడు కొద్దిసేపటి క్రితం స్టార్ హీరోయిన్ నయనతార, తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అందరూ ఎటువంటి భయంలేకుండా హ్యాపీగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రజలని కోరారు నయనతార. ఇక ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది ... !!