టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో పిజ్జా సినిమాతో హీరోగా మారిన ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. విజయ్ సేతుపతి తర్వాత ఆయన చేస్తున్న వరుస సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన ఉప్పెన సినిమాలో రాయనం పాత్రలో ఆయన నటించిన తీరు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. 


దీంతో ఇప్పటికే ఆయన చేత డైరెక్ట్ తెలుగు సినిమా చేయించాలని నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా ఒకటి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉప్పెన సినిమాను తెరకెక్కించిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆయనతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇక ఇప్పటికే కధ కూడా చెప్పగా ఆ కధ ఆయనకు బాగా నచ్చిందని చెబుతున్నారు. 


దర్శకుడు ఎవరు ఏమిటి అనే వివరాలు ఇంకా బయటకు వెల్లడి కానప్పటికీ సుకుమార్ టీమ్ లో నుంచి ఎవరైనా ఆయన సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు సైతం తాకింది. విజయ్ తో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు.  అయితే విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నా, ఇప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించాయి అని అని తెలుస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: