టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్. ఈమె గురించి అందరికీ తెలిసిందే. కమలహాసన్ గారాలపట్టి ఆయన పెద్ద కూతురు శృతిహాసన్, తండ్రి బ్యాక్ గ్రౌండ్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన సత్తా ఏంటో చాటుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ , ఈ మధ్య వార్తల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకే శృతిహాసన్ ఒకరితో ప్రేమలోపడి, ఆ ప్రేమ కాస్త  బ్రేకప్ కావడంతో కొద్ది రోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఇటీవల తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేయాగా అవి వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే..ఇక ఈ మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన, రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది అని చెప్పవచ్చు.  ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో  బాగా ట్రెండ్ అవుతున్నాయి.


ఇదిలా ఉండగా ,కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి అందరిని మెప్పించింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమాను తీశారు. ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ సరసన"సలార్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు అన్నీ వాయిదా పడగా, ఇంట్లో ఉంటూ సోషల్ మీడియా లో  బిజీగా మారిపోయింది.

ఇక ఇప్పుడు  తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు ఇలా  స్పందించింది.. తన చెల్లెలు అక్షర హాసన్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పింది. అంతేకాకుండా తను  దర్శకత్వ రంగంలో రాణించాలనే కోరిక ఉందని తెలిపింది. తన చెల్లెలు దర్శకత్వం వహిస్తే, తనకు సరిపడా కథను అందిస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది శృతిహాసన్. ఇక కమల్ హాసన్, సారిక 1980 లో ప్రేమ వివాహం చేసుకోగా 1986 లో శృతి హాసన్ జన్మించింది. ఆ తరువాత 1991లో రెండవ కూతురు అక్షర హాసన్ జన్మించింది. ఇక 2004లో కమల్ హాసన్,తన భార్య సారిక ఇద్దరు విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: