అనుష్క శెట్టి ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో అందరి మనసుల్ని గెలుచుకుంది. అనుష్క చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్‌లే ఉన్నాయి. అయితే అరుంధతి సినిమాతో అనుష్క భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో స్వీటీ లేడీ సూపర్ స్టార్‌ హోదాను సంపాదించుకుంది. ఆ తరువాత అమ్మడి కోసం ప్రత్యేకంగా లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా సిద్దం చేశారు. వాటిలో అమ్మడు కొన్నింటిలో నటించింది. పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం సినిమాలు ఈ కోవలోవే. అయితే ఈసినిమాలు అరుధంతి రేంజ్ హిట్‌ను అందుకోలేక పోయాయి. వీటిలో సైజ్ జీరో సినిమా కోసం అనుష్క చేసిన ప్రయోగం కూడా అంత మంచి ఫలితాన్ని అందించలేక పోయింది.


ఆ తరువాత వచ్చిన నిశ్శబ్దం సినిమా కూడా అదే విధంగా నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు అనుష్క మరో సినిమాను ప్రకటించలేదు. అయితే తాజాగా యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే తాజాగా స్వీటీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వార్తలు ఇదివరకే వచ్చినా, తాజాగా డిజిటల్ ఎంట్రీకి అనుష్క కూడా సిద్దమయిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ కథను కూడా ఓకే చేసిందని, అందుకనే ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రకటించలేదని టాక్ నడుస్తోంది.



అయితే ‘ఆహా’ నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌ల్లో భాగంగా ఓ కథను స్వీటీకి వినిపించారట. మంచి కథతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్న అనుష్క ఈ కథ తనకు సరిగ్గా సరిపోతుందని భావించి పచ్చజెండా ఊపిందట. ప్రస్తుత పరిస్థితులు కాస్త మెరుగు పడితే వెబ్ సిరీస్ ప్రారంభం అవుతుందని టాక్ నడుస్తోంది. ఈ మేరకు వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో ఎంత నిజమెంతో స్వీటీనే తెలపాలి. మరి అమ్మడు ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: