సినిమా రంగంలో ప్రవేశించి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు సినిమాతో హిట్ దక్కింది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఇప్పటికే రౌడీ స్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే హీరోగా నాలుగు డబ్బులు సంపాదిస్తున్న సమయంలో ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు నిర్మాతగా మారి లక్ పరీక్షించుకుంటున్నారు. అందరిలాగానే విజయ్ దేవరకొండ కూడా కింగ్ అఫ్ ది హిల్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించాడు. తనకు హీరోగా అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్ ని హీరోగా చేస్తూ మీకు మాత్రమే చెప్తా అనే సినిమా చేయగా తన తమ్ముడిని హీరోగా పెట్టి పుష్పక విమానం అనే సినిమా చేస్తున్నాడు. 


అయితే ఈ మధ్య కాలంలో ఆయన పృద్వి సేనా రెడ్డి అనే ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడని, ఆయన చెప్పిన కథ నచ్చడంతో తన బ్యానర్ ద్వారా సినిమాని నిర్మిస్తున్నాడు అని ప్రచారం జరిగింది. అయితే దీని వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఈ పుష్పక విమానం అనే సినిమాని విజయ్ దేవరకొండ ఒక్కడే నిర్మించడం లేదు. టాంగా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ తో కలిసి విజయ్ దేవరకొండ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పుష్పక విమానం సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఈ టాంగా ప్రొడక్షన్స్ సంస్థ రెండో సినిమా కూడా ప్రారంభించింది. ఆ రెండో సినిమా దర్శకుడే పృథ్వి సేనా రెడ్డి. 2020 అక్టోబర్ నెలలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 


ఆ సమయంలో ఈ సినిమా ద్వారా అందరూ కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని అని ప్రకటించారు. ఇప్పుడు అదే దర్శకుడికి విజయ్ దేవరకొండ అవకాశం ఇచ్చాడు అనే ప్రచారం మొదలైంది.. అయితే ఆ సినిమా గతంలో మొదలు పెట్టిన సినిమానేనా లేక విజయ్ దేవరకొండతో పృద్వి సేనా రెడ్డి మరో సినిమా చేస్తున్నాడా అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలు అవుతున్నాయి. ఇప్పటికే టాంగా ప్రొడక్షన్స్ తో కలిసి పుష్పక విమానం చేస్తున్న విజయ్ దేవరకొండ వారు చేస్తున్న రెండో సినిమాకి కూడా సహ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. బహుశా ఆ వార్తనే విజయ్ దేవరకొండ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు అంటూ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: