టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ కం బ్యాక్ మూవీగా మారగా రామ్ కు ఎంతో అవసరమైన సమయంలో హిట్ దక్కింది. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన రెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. కంటెంట్ పరంగా సినిమా బాగానే ఉన్నా కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో గ్యాప్ తీసుకొని మరీ రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి తో సినిమా చేస్తున్నాడు. తమిళనాట మాస్ చిత్రాల దర్శకుడిగా పేరున్న లింగుస్వామి రామ్ తో సినిమా అనగానే ప్రేక్షకులకు ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ కనిపించింది.

ఈ సరికొత్త కలయికలోని సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది చిత్రబృందం. ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాసినిమా తెరకెక్కబోతోందని, రామ్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. రామ్ ని గతంలో ఎవరూ చూపని విధంగా లింగుస్వామి చూపెడతాడు అని కలలు కంటున్నారు. అయితే ఈ సినిమా విషయంలో లింగుస్వామి తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రామ్ అభిమానులు ఎంతగానో కలవరపెడుతోంది.

రామ్ కి సరితూగే లా విలన్ పాత్రను సృష్టించి వినూత్నంగా తెరకెక్కించబోతుండడం తో ఈ పాత్రకు బాగా తెలిసిన స్టార్ నటుడి ని ఎంపిక చేయాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వారికి సమాధానంగా మాధవన్ కనిపించాడట. రామ్ కి విలన్ గా మాధవన్ అయితే బాగుంటుందన్న ఆలోచన చేసి ఆయనను ఎంపిక చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగోలా ఈ వార్త బయటకి రావడంతో రామ్ అభిమానులు మాధవన్ ని విలన్ గా ఎంపిక చేయవద్దు అని లింగుస్వామి కి సూచిస్తున్నారట. మాధవన్ ఇప్పటివరకు చేసిన రెండు తెలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. సవ్యసాచి,  నిశ్శబ్దం సినిమాలు ఘోర పరాజయం పాలవడంతో రామ్ సినిమా లో విలన్ గా మాధవన్ వద్దని చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: