టాలీవుడ్‌లో అగ్ర స్థాయి కమెడియన్‌గా పేరు తెచ్చుకొని హీరోగా మారిన నటుడు సునీల్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు. జక్కన్న దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత హీరోగా మరిన్ని సినిమాలు చేశాడు. కానీ హీరోగా అనుకున్న స్థాయిలో రాణించలేక పోయాడు. దాంతో మళ్లీ కమెడియన్‌గా రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు, అదే సమయంలో డైరక్టర్‌గా కూడా ట్రై చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సునీల్ చేస్తున్న సినిమా ‘కనబడుటలేదు’. ఇందులో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే.


ఈ సినిమాను బాలరాజు దర్శకత్వంలో సుధీర్ తలసిల నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలరాజు క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సునీల్ డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పటి వరకు క్లారటీ రాలేదు. అన్ని అనుకున్నట్లు జరిగితే ‘కనబడుటలేదు’ సినిమాను మేకర్స్ ఈ ఏడాదే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కానీ కరోనా రెండో వేవ్ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలూ లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కనబడుటలేదు సినిమా విడుదల విషయంలో అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

ఈ సినిమాను మేకర్స్ ఓటీటీలో విడుదల చేసేందుకు చూశారట. కానీ అందుకు సునీల్ ఓకే చెప్పలేదట. కొన్నాళ్లు వేచి చూద్దామని, పరిస్థితులు ఇదే తరహాలో ఉంటే మీకు నచ్చినట్లు చేయమని అన్నాడని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఓటీటీ సంస్థలు కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాయట. కానీ సినిమా స్టోరీ బాగుందని, సినిమా కూడా బాగా వచ్చిందని మేకర్స్ ఓటీటీ ఆఫర్స్‌ను పక్కన పెట్టారట. దాదాపుగా ‘కనబడుటలేదు’ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి త్వరలో ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott