టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు అక్కినేని వారసుడు నాగ చైత.ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు.చైతూ సరసన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఇటీవల ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని..విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో 'థాంక్యూ' అనే మరో సినిమా చేస్తున్నాడు చైతూ..రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసాడు ఈ హీరో. సినిమాలో చైతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు కి వీరాభిమానిగా కనిపించనున్నాడు.

అంటే మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కనిపిస్తాడట.ఇక ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా చివరి దశలో ఉంది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం చైతూ ఓ బాలీవుడ్ సినిమాలో నటించనున్నాడు.బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో 'లాల్ సింగ్ చద్దా' అనే  సినిమా తెరకెక్కుతోంది.'ఫారెస్ట్ గంప్' అనే హాలీవుడ్ సినిమాకి ఇది రిమేక్ అని సమాచారం.అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాల ఓ కీలక పాత్ర కోసం గతంలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించగా..

మొదట ఆయన అంగీకరించినప్పటికి ఆఖరిలో డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఈ సినిమా నుండి తప్పుకున్నారట.దీంతో విజయ్ సేతుపతి స్థానంలో నాగ చైతన్యను తీసుకున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా కథ ప్రకారం చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.దీనికోసం తన లుక్ ని సైతం మార్చుకోబోతున్నాడు చైతు.దినికి సంబందించి కాశ్మీర్ లోని కార్గిల్ ప్రాంతంలో ఓ షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు అక్కడ 45 రోజులు షూటింగ్ చేయనున్నారట.ఈ షెడ్యూల్ లోనే చైతూ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ ని మొదలు పెట్టనున్నట్లు తాజా సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: