క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ స్టోరీ'..ఫిదా సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల.. ఈసారి కూడా ఒక చక్కటి ప్రేమ కథతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో 'సారంగదరియా' అంటూ సాగే పాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అన్ని సినిమాల మాదిరిగానే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉండగా.విడుదలకు మరో వారం రోజుల ముందే చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి మరీ.. కరోనా పరిస్థితుల దృష్ట్యా విడుదల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం అందుతోంది.

 ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది.ఎంత కాదన్న మరో నెల రోజుల వరకు అన్ని పరిస్థితులు మళ్ళీ మాములు స్థితికి చేరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఆగస్టు వరకు ఒకవేళ పరిస్థితులు అన్ని చక్కబడకపోయినా కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మేరకు చిత్ర యూనిట్ త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ.. అధికారికంగా ప్రకటించనున్నారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: