టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున తర్వాత అక్కినేని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ..హీరోగా మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు నాగ చైతన్య.అయితే కెరీర్లో  ప్రయోగాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ.. ఎక్కువగా ప్రేమ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యాడు ఈ హీరో. అలా చైతూ నటించిన ప్రేమకథా చిత్రాల్లో  'ప్రేమమ్' సినిమా కూడా ఒకటి.2016 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను.. తెలుగు నేటివికి తగ్గట్లుగా రీమేక్ చేసాడు దర్శకుడు చందూ మొండేటి. ఇక సినిమాలో చైతూ సరసన హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లతో పాటుగా శ్రుతిహాసన్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించారు.మలయాళ రీమేక్ కి ఏ మాత్రం సోల్ మిస్సవ్వకుండా దర్శకుడు చందూ ఈ సినిమాని తెరికెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక సినిమాలో శ్రుతిహాసన్ పాత్ర ప్రధాన హైలైట్ గా నిలిచింది. సినిమాలో ఆమె కాలేజి లెక్చరర్ పాత్రలో మంచి నటనను కనబర్చింది. ఇక ప్రతి మనిషి జీవితంలో ఉండే మూడు దశలను ఆ సమయంలో వారిలో కలిగే ప్రేమ, అనుబంధం వంటి అంశాలను చక్కగా తెరపై చూపించారు. దర్శకుడు చందు మొండేటి.అందులో శ్రుతిహాసన్, చైతూల మధ్య వచ్చే లవ్ స్టోరీ హైలైట్ గా నిలిచింది.ఇక సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ గోపిచంద్ సుందర్ మ్యూజిక్.సినిమాలోని పాటలు, నేపధ్య సంగీతం మంచి ఫీల్ ని క్రియేట్ చేసాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

1.మలయాళంలో "ప్రేమమ్" అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల చేయడం విశేషం.

2.దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో అతిధి పాత్రల్లో కనిపించారు.అందులో వెంకటేష్.. చైతూకి మామ గా నటించగా.. నాగార్జున తండ్రి పాత్రలో కనిపించారు.

3.ఇక సినిమాలో మూడు దశల ప్రేమ కథల్ని చూపించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో విక్రమ్ పాత్రలో మూడు వేరీయేషన్స్ ని చూపించడానికి చైతూ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఈ సినిమాలో టీనేజ్ గా కనిపించడానికి చైతూ ఏకంగా రెండు నెలలు ఆహారం మానేసి.. కేవలం దర్శకుడు చెప్పిన డైట్ ని ఫాలో అయ్యాడట..

సో మొత్తానికి చైతూ కెరీర్ లో ఏ మాయ చేసావే వంటి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ తర్వాత.. ఎవర్ గ్రీన్ లవ్ స్టొరీగా నిలిచింది ప్రేమమ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: