కొంత మంది హీరోయిన్లకు టాలెంట్ ఎంత ఉన్నా కూడా అదృష్టం లేక సినిమా ఇండస్ట్రీలో వెనుక పడిపోతారు. అలా క్రమక్రమంగా కనుమరుగై వారి జీవితాల్లో సెటిల్ అయిపోయి ఎప్పుడో గాని మళ్లీ వార్తల్లోకి రారు. ఆ విధంగా ఎంతో మంది హీరోయిన్ లు తెరపై ఒకటి రెండు సినిమాల్లో మెరిసి ఆ సినిమాల ద్వారా వారికి పేరు ప్రఖ్యాతలు రాక వెనకబడి పోయి నార్మల్ గా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారిలో సక్సెస్ లేక తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ విమలా రామన్ ఒకరు.

2009లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఎవరైనా ఎప్పుడైనా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ జగపతిబాబు గాయం 2 సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే గ్లామర్ హీరోయిన్ గా ఆమె కు మంచి పేరు వచ్చినా కూడా సక్సెస్ మాత్రం లేకపోవడంతో ఆమె ఇండస్ట్రీకి దూరమైపోయింది. రంగా ది దొంగ, రాజ్ వంటి పలు సినిమాల్లో కనిపించిన కూడా ఏ సినిమా విమలారామన్ కు అదృష్టం తెచ్చి పెట్టలేకపోయింది. 

తన గ్లామర్ తో నైనా ఆకట్టుకోవాలని చెప్పి అల్లరి నరేష్ శర్వానంద్ కలిసి నటించిన నువ్వా నేనా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి తన అందాల విందు చేసింది. ఆ క్రమంలోనే ఆమెకు తరుణ్ జంటగా ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇక లాభం లేదని టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ 2017లో నాగార్జున హీరోగా నటించిన ఓం నమో వెంకటేశాయ సినిమా లో అమ్మవారి పాత్రలో నటించి మళ్లీ ఇప్పటిదాకా మరొక సినిమా చేయలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విమలారామన్ ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వారిని కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె సరికొత్త గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. బీచ్ ఒడ్డున బికినీతో ఆమె కుర్రకారు మతి పోగొడుతూ రీ ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: