హీరో రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి రకా ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఆయన పదుల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తరువాత రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోగా పరిచయమైయ్యాడు. ఈ సినిమా రాజ్ తరుణ్ తరుణ్ కి మంచి విజయాన్ని తీసుకొచ్చింది. ఇక మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రాజ్ తరుణ్ సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలు సైతం అంచనాలను మించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక రాజ్ తరుణ్ నటించిన కుమారి 21ఎఫ్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే రాజ్ తరుణ్ కి చేతినిండా సినిమాలు ఉన్నా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన సినిమా జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటుండు. ఇక కొన్ని నెలల క్రితం రాజ్ తరుణ్ కి యాక్సిడెంట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. తాజగా రాజ్ తరుణ్యాక్సిడెంట్ గురించి  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను చెప్పారు. అయితే ఆ యాక్సిడెంట్ ఘటన వల్ల చాలా డిస్టర్బ్ అయ్యానని రాజ్ తరుణ్ తెలియజేశారు. ఇక ఆ ఘటన జరిగిన సమయంలో తనకు వైరల్ ఫీవర్ కూడా వచ్చిందని రాజ్ తరుణ్ తెలిపారు.

ఇక రాజ్ తరుణ్ రాజా రవీంద్రకు కాల్ చేసి తనకు ఎవరికీ సమాధానం చెప్పే ఆసక్తి లేదని తనకు ఏం చెప్పొద్దని చెప్పానని ఆయన అన్నారు. అంతేకాదు.. కార్తీక్ అనే వ్యక్తి తనకు అస్సలు పరిచయం లేదని ఆ వ్యక్తి చేసింది తప్పే అని అలా డబ్బులు డిమాండ్ చేశాడంటే తనకు ఏం అవసరాలు ఉన్నాయో అని రాజ్ తరుణ్ అన్నారు. అంతేకాదు.. ఆ ఘటన తర్వాత డ్రైవింగ్ మానేశానని రాజ్ తరుణ్ అన్నారు. ఇక ఆ ఘటన భయపెట్టిందని రాజ్ తరుణ్ మాటలు వింటే అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: