సెలబ్రిటీ వరల్డ్ లో గెట్ టుగెదర్ పార్టీ లు తరచుగా జరగడం మనం చూస్తూనే ఉంటాం. షూటింగ్ లు లేని సమయంలో, బ్రేక్ దొరికిన సమయంలో వీరు పార్టీలు చేసుకుంటూ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తూ ఉంటారు. సింగిల్ గానే కాకుండా తమ ఫ్యామిలీ ల తో సైతం పార్టీ లకు వెళుతూ వారి కుటుంబాల మధ్య ఉన్న అన్యోన్యతను ప్రేక్షకులకు తెలియజేసే విధంగా ప్రయత్నాలు చేస్తారు. సమయం దొరికితే స్నేహితులతో విలసాలలో తేలేందుకు ఎక్కువగా ఇష్టపడే మన సెలబ్రెటీలు ఇలా కుటుంబాల తో గడపడం ఎంతో ఆనందం ఇస్తుంది వారి వారి అభిమానులకు.

తాజాగా మాలీవుడ్ పాపులర్ జంటలు డిన్నర్ పార్టీ కోసం అంతా ఒక్కచోట కలిసారు. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నజ్రియా, దుల్కర్ సల్మాన్ అమల్ సుఫియ,  పృథ్వీరాజ్ సుప్రియ మీనన్ లు అంతా ఒకే చోట కలిసి డిన్నర్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, పార్టీ డ్రెస్ లో ఈ మూడు జంటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అంత బ్లాక్ దుస్తులు ధరించి కోడ్ అనుసరిస్తున్నట్లూ కనిపిస్తూ అభిమానులు ఎంతగానో ఆకర్షిస్తున్నారు.

పెళ్లికి ముందు నజ్రియా పార్టీ కల్చర్ బాగా అలవాటు. కానీ వివాహానంతరం ఈమె పార్టీ లకు బాగా దూరం అయిందని తెలుస్తుంది. ఈ మూడు జంటలు పార్టీ లకు బాగా అలవాటుపడ్డారు. ముఖ్యంగా సుఫియ నజ్రియా కుటుంబానికి బాగా దగ్గర బంధువు కావడంతో ఆ ఇద్దరూ పార్టీలకు ప్లాన్ చేస్తుంటారు. ఈ మూడు జంటలు ప్రస్తుతం మలయాళంలో బిజీ గానే ఉన్నాయి. నజ్రియా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. నాని హీరో గా రాబోతున్న అంటే సుందరానికి సినిమాలో నటించబోతున్నారు. ఇక ఆమె భర్త ఫాహాద్ ఫజిల్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో విలన్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: