నందమూరి
ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా ఎలాంటి వివాదాలకు వెళ్ళకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ, తన పనులు తాను చేసుకుంటూ తన ఫ్యామిలీని తను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేవారు. ప్రస్తుతం
రాజమౌళి దర్శకత్వంలో
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు పాన్
ఇండియా మార్కెట్ రాబోతుంది.
రామ్ చరణ్ తో కలిసి
ఎన్టీఆర్ చేస్తున్న ఈ
సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తన నటనతో ఎంతటివారినైనా ఎదిరించగల
ఎన్టీఆర్ కొన్ని పుకార్లు మాత్రం తప్పించుకోలేక పోయాడు. అందరి
హీరో లలాగానే ఈయన కూడా ఒక
హీరోయిన్ తో అఫైర్ నడిపించాడనే నిండా ఇప్పటికీ మోస్తున్నారు.
ఆమె
హీరోయిన్ సమీరా రెడ్డి.
టాలీవుడ్ కి ఈ
హీరోయిన్ నరసింహుడు అనే
సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత జై చిరంజీవ,
అశోక్ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆమె తెలుగులో చేసిన మూడు సినిమాలలో చేసిన రెండు సినిమాలు
ఎన్టీఆర్ తోనే చేయడంతో వారిద్దరికీ ఏదో సంబంధం ఉందని రాయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటూ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
బెంగాలీ సినిమా ద్వారా
సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది సమీర. ఆ తర్వాత నరసింహుడు
సినిమా కు అనుకోకుండా ఆమెకు అవకాశం వచ్చింది.
ఆ సినిమాలో సమీరా
రెడ్డి అందరినీ ఆకట్టుకొగా తర్వాత
మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన జై చిరంజీవ సినిమాలో అవకాశం దక్కించుకుంది. రెండవ సినిమాతోనే
మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోతో
సినిమా చేయడం అప్పట్లో పెద్ద విషయం. త్వరలోనే ఈమె స్టార్
హీరోయిన్ కావడం ఖాయం అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఆ వెంటనే
ఎన్టీఆర్ తీసిన
అశోక్ సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. లేని ఎఫైర్ ను సృష్టించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై తెలుగులో మరో
సినిమా చేయడానికి ఇష్టపడలేదట. ఆ కారణంగానే మళ్ళీ తెలుగులో
సినిమా చేయలేదని అంటూ ఉంటారు ఆమె సన్నిహితులు.