మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తుండగా కీర్తి సురేష్ బ్యాంక్ ఉద్యోగిని గా కనిపించనున్నట్లు టాక్. బ్యాంకుల్లోని పలు ఆర్ధిక నేరాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో కూడిన భారీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ సర్జా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
కొన్నాళ్ల క్రితం దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ని ఇటీవల హైదరాబాద్ లో మొదలెట్టారు, అయితే మధ్యలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా హఠాత్తుగా షూట్ ని ఆపేసిన యూనిట్, త్వరలో తదుపరి షెడ్యూల్ ని మొదలెట్టనున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది 2022 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఇక ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ తో ఒక భారీ సినిమా చేయనున్నారు మహేష్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు టాక్.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే, రష్మిక మందన్న, కియారా అద్వానీ పేర్లు కొద్దిరోజుల నుండి వినిపిస్తుండగా రెండు రోజుల క్రితం మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా నయనతార హీరోయిన్ గా ఎంపికైనట్లు కొన్ని మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ మూవీలో నయనతార ఎంపికైన మాట వాస్తవమే కానీ, ఆమె సినిమాలో చేస్తోంది హీరోయిన్ గా కాదు మహేష్ కి వదిన పాత్రలో అని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దీనిపై ఆ మూవీ యూనిట్ నుండి అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: