లేడీ సూపర్ స్టార్ నయనతార... హీరోయిన్గా ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. వెంకటేష్ హీరోగా వచ్చిన లక్ష్మి సినిమా తో నయనతార తెలుగులో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి ఛాన్సులు కొట్టేసింది నయనతార. అయితే సినిమాలే కాదు వ్యక్తిగత విషయాల్లో తోనూ వార్తల్లో నిలిచింది నయనతార. మొదట్లో వల్లభం షూటింగ్ సమయంలో... శింబుతో నయన్ కు లవ్ ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుదేవా పేరు కూడా వినిపించింది. శింబు, ప్రభుదేవా ఎపిసోడ్ ల తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రస్తుతం ప్రేమాయణం నడుపుతోందని నయనతార. తవర్లోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. 

 ఇది ఇలా ఉండగా  నయనతార తండ్రి కురియన్ కోడియట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. నయనతార తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార ఇటీవలికాలంలో ప్రత్యేక విమానంలో కొచ్చికి వచ్చి వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తన కూతురి పెళ్లి ని కళ్లారా చూసుకోవాలని నయన్ తండ్రి ముచ్చట పడుతున్నారని సమాచారం. కొద్దికాలంగా ఇదే విషయాన్ని నయన తారతో ప్రస్తావించారని టాక్.

 గత కథనాలు ఏళ్లుగా విగ్నేష్ తో ప్రేమలో ఉన్న నయనతార... పెళ్లి విషయంపై మాత్రం కాస్త వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని... పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక తమ పెళ్లి విషయాన్ని ఈ మధ్య విగ్నేష్ శివం సైతం అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో ముచ్చటించిన ఆయన త్వరలోనే తమ పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: