టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల విషయంలో పోటీ ఏర్పడడం కామనే. ఒకే రోజు లేదా ఒకే వారం లో ఇద్దరు హీరోలు తమ సినిమాలతో పోటీ పడడం చూసుంటారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.ఏకంగా ఇద్దరు అన్నదమ్ములు తన సినిమాలతో బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నారు.వాళ్లే మన అక్కినేని వారసులు.ఈ ఇద్దరి అన్నదమ్ముల సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ,అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలుస్తోంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాలు..

ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వడంతో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయానికొస్తే..ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉన్నా..కరోనా వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఇప్పుడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఇక ఈ రెండు సినిమాలు కేవలం వారం గ్యాప్ లోనే రిలీజ్ చేయనున్నారట.ఈ నేపథ్యంలో ఆగస్టు 7వ తేదీన చైతూ లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక వారం తర్వాత ఆగస్టు 13 న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.ఇక ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉండగా.. ఈ రెండు సినిమాలు కూడ కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కడం విశేషం.మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: