సీనియర్ హీరోయిన్లంతా తమ కేరీర్ ను  బాల నటులుగానే నటించారు. శ్రీదేవీ బాల నటిగా నటించిన సంగతి మనందరికి తెలుసు. రోజా రమణి కూడా భక్త ప్రహ్లాదగా నటింటిన మనందరిని మెప్పించారు. అలాగే ఈ కోవలోకే స్టైలిష్ స్టార్ అల్లూఅర్జున్ కుమార్తె అర్హ కూడా చేరబోతుంది.

బన్నీకు అర్హ అంటే ఎంత ప్రేమో మనందరికి తెలుసు. కూతరు చేసే వీడియోలను ఎప్పటికప్పుడు అల్లూఅర్జున్ సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లతో పంచుకుంటాడు. ఆమె బుజ్జి బుజ్జి తెలుగు మాటలంటె నెటిజన్లకు కూడా తెగఇష్టడపడారు. ఇంకా ఆ ఆడియోలతే టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ కూడా వచ్చేశాయి.

గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రధాన పాత్రలో అక్కినేని సమంత నటిస్తున్నారు. అయితే ప్రిన్స్ భారత పాత్రలో అల్లు అర్హ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. శ్రీదేవీ, రోజా రమణిల క్లబ్ లో అల్లూఅర్జున్ గారాల పట్టి అర్హ కూడా చేరుతున్నట్లు తెలిపింది. ఈ వార్త తెలియగానే బన్ని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుణశేఖర్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తన కేరీర్ లో చేసిన సినిమాలు కొన్నే అయినా ఒక్కోటి ఒక్కో రకం. చెప్పాలంటే గత పదేళ్లలే గుణశేఖ దర్శకత్వం వహించిన సినిమాలు రెండో మూడు. ఆరేళ్ల క్రితం రుద్రమదేవీ మూవీని ప్రేక్షకుల ముందుంచ్చారు. అంతే ఆ తరువాత నుంచి ఏ సినిమాకు సైన్ చేసింది లేదు. తాజాగా శాకుంతలం మూవీతో మళ్లీ ఏంట్రీ ఇవ్వబోతున్నారు. పూర్తి మైతలాజికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది.

కరోనా సెకండ్ వేవ్ ముందే సినిమా సగం షూటింగ్ పూర్తయినట్లు టాక్. మళ్లీ ఇప్పుడు షూటింగ్ ను పట్టాలెక్కించారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు సమంత చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలిపింది. చూడాలి ఈ మూవి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: