కరోనా పీరియడ్ లో ఓటిటి వేదికలు ఓ రేంజ్ లో వేగాన్ని పుంజుకున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీ లకు బాగానే అలవాటు పడిపోయారు. రకరకాల షోలతో, వెబ్ సిరీస్లతో, కొత్త సినిమాల సందడితో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. ఆహా, అమెజాన్ ప్రైమ్, సోనీ వి, నెట్ఫ్లిక్ హాట్స్టార్ ఇలా ఎన్నో యాప్ లు ఓటిటి వేదికలపై తమ సత్తా చాటుతూ లాభాలు అర్జిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ ఓ టి టి యాప్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ సరికొత్త షోతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అందులోనూ ఈ షో సెలబ్రిటీల పిల్లలకు సంబంధించిన షో తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే... గతంలో మహేష్ బాబు తనయురాలు సితార షోతో రాబోతున్నట్లు వార్తలు వినిపించగా ఇప్పుడు అది నిజమేనని చెబుతున్నారు.
కాగా 'చిచ్చర పిడుగులు' టైటిల్ తో ఓ కిడ్స్ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో సితార మరియు అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ప్రధాన భూమికలు పోషించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. వారానికి ఒకసారి ఈ షో స్ట్రీమ్ కాబోతుందని, ప్రతి వారం షోకి స్టార్ కిడ్స్ సెలబ్రిటీలుగా వస్తారని సమాచారం. దీంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సెన్సేషనల్ న్యూస్ నిజమా కాదా అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో ప్రస్తుతానికి గాసిప్ అనే తెలుస్తోంది.

 అయితే ఇది నిజమైతే ఆ షోకి వచ్చే ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మరో వైపు అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ.. ఈ షో కోసం సన్నాహాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వినబడుతున్నాయి. మరి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం మూవీలో నటించనుందన్న విషయం తెలిసిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: