టాలీవుడ్ లో వారసత్వం అనేది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి. ఎంతో మంది స్టార్ హీరోల కూతుర్లు కొడుకులు సినిమాల్లోకి వచ్చి తమ టాలెంట్ ను ప్రదర్శించి స్టార్ లు గా ఎదిగారు.  సీనియర్ హీరో లైనా వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ల వారసులు గా వచ్చి స్టార్ లు గా ఎదగగా వారి వారసులను కూడా సినిమాల్లోకి తీసుకు వచ్చారు. అక్కినేని నాగార్జున తన ఇద్దరు కొడుకులను హీరోలుగా టాలీవుడ్లో ఎంట్రీ చేయించారు నందమూరి బాలకృష్ణ కూడా తన కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా పరిచయం చేయబోతున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి బాటలో ఎంతో మంది మెగా వారసుల సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అఅయిపోయారు.

ఆ విధంగా టాలీవుడ్ లో పాతుకుపోయిన వారసులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి ఎన్టీఆర్ ఆర్ వారసుడిగా బాలకృష్ణ, ఎన్టీఆర్ మనవడు గా యంగ్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి తమ తమ సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ రాజు వంటి వారసులు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా ఉన్నారు. 

ప్రస్తుతం రెండవ జనరేషన్ వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా ఇప్పుడు మూడవ తరం వారసులు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూ సినిమాల్లో వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మన హీరోలు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పటికే బాల నటుడిగా కొన్ని సినిమాలలో నటించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తనయుడు భార్గవ్ రామ్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడట. ఇలా మన స్టార్ హీరోలు తమ వారసులను సినిమా ఇండస్ట్రీలోకి బాల్యం లోనే తీసుకు వస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: