ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలో
అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడిపోతారో కూడా అర్థం కాని పరిస్థితులు వచ్చాయి. మరోవైపు హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్న వారిని పెళ్లాడటం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది నటీమణులు పెళ్లి అయిన వారిని రెండో పెళ్లి చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ప్రియమణి కూడా అలాంటి పెళ్లే చేసుకుంది. 2017 లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రియ‌మ‌ణి పెళ్లాడింది. ముస్త‌ఫా రాజ్ కు అప్పటికే ఆయేషా అనే మహిళ తో పెళ్లి కాగా వారికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017 లో ఆయేషా ముస్తఫా విడిపోయారు.


ఆ తర్వాత ముస్తఫా ప్రియ‌మ‌ణిని పెళ్లి చేసుకున్నాడు. ఇక‌ ప్రియమణి పెళ్లి చేసుకున్న నాటి నుండి కొంత కాలం సినిమాలకు దూరం అయింది. కానీ ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా వెంకటేష్ హీరోగా నటించిన నార‌ప్ప సినిమాలో ప్రియ‌మ‌ణి హీరోయిన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఇన్నేళ్ల తర్వాత ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేశా ...ప్రియమణి పై సంచలన కామెంట్ లు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నఆయేశా మాట్లాడుతూ... తన భర్త ముస్తఫా రాజ్ కు తానింకా విడాకులు ఇవ్వలేదని చెప్పింది. అంతే కాకుండా తాను మాజీ భార్య ను కానని ముస్తఫా రాజ్ కు ఇప్పటికీ తానే భార్యను అని తెలిపింది. 

అంతేకాకుండా ముస్తఫా రాజ్.. ప్రియమనిని పెళ్లి చేసుకునే నాటికి ఇంకా తాము విడాకులకు అప్లై చేసుకోలేదని కాబట్టి ప్రియమని వివాహం చెల్లదని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోవైపు తన పిల్లలను ముస్తఫా రాజ్ పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేసింది. ఇక ప్ర‌స్తుతం ఆయేశా కామెంట్లు సంచలనంగా మారడంతో దీనిపై ముస్త‌ఫా రాజ్ స్పందించారు. తాను పిల్లల కోసం క్రమం తప్పకుండా డబ్బులు పంపిస్తున్నాన‌ని చెప్పారు. ఒకవేళ తాను డబ్బులు పంపించకపోతే ఆయేశా ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉంటుంద‌ని ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే ప్రియమణి మాత్రం గత కొద్ది రోజులుగా ముస్తఫా రాజ్ బంగారం అని తనకు సినిమాల్లో నటించడానికి మళ్లీ అనుమ‌తి ఇచ్చాడంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: