మ్యాన్లీ హీరో గోపీచంద్ ఈమధ్య కెరియర్ లో చాలా వెనకపడ్డాడు. సీటీమార్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గోపీచంద్ ఈ సినిమా తర్వాత మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ శ్రీవాస్ డైరక్షన్ లో ఒక సినిమా ఉంటుందని ఎనౌన్స్ మెంట్ వచ్చింది. లక్ష్యం, లౌక్యం సినిమాల హిట్ తో ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి.

ఇక ఇవన్ని కాకుండా ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి తో కూడా గోపీచంద్ సినిమా ఉంటుందని టాక్. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఆరెక్స్ 100 సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన అజయ్ భూపతి తన రెండో సినిమాగా మహా సముద్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మహా సముద్రం రిలీజ్ అవగానే గోపీచంద్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడట అజయ్ భూపతి. అజయ్ భూపై, గోపీచంద్ అసలు ఊహించని ఈ కాంబో సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తుంది. ఓ పక్క స్టార్ హీరోలతో పాటుగా మీడియం హీరోల సినిమలు చేస్తుంది మైత్ర్ బ్యానర్. గోపీచంద్ సినిమాతో పాటుగా శ్రీ విష్ణు, అఖిల్ హీరోగా చేసే సినిమాలను కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బ్యానర్ ఏదైనా ఉంది అంటే అది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పొచ్చు. మారుతి పక్కా కమర్షియల్, శ్రీవాస్ సినిమాలతో పాటుగా అజయ్ భూపతి సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా తప్పకుండా అజయ్ భూపతి మార్క్ ప్రయోగాత్మక సినిమా అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: