"ఫ్యామిలీ మ్యాన్-2" ఫేమ్ బ్యూటీ ప్రియమణి వివాహం వివాదాస్పదంగా మరి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. 2017లో ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాహం జరిగింది. అయితే ముస్తఫాకు అంతకుముందే ఆయేషాతో వివాహం జరిగింది. అయితే తాజగా ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా వారి వివాహం చెల్లదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ వివాహాన్ని లీగల్ నోటీసుతో సవాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ముస్తఫా తన నుండి చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో అతని వివాహం చెల్లదని ఆ నోటీసుల సారాంశం. ముస్తఫా ఇప్పటికీ నన్నే వివాహం చేసుకున్నట్టు... మేము విడాకులకు కూడా దాఖలు చేయలేదు. ప్రియమణిని వివాహం చేసుకుంటున్నప్పుడు అతను బ్రహ్మచారి అని కోర్టులో ప్రకటించాడు" అని ఆయేషా పేర్కొంది. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని ముస్తఫా చెబుతున్నాడు. ఈ వివాదం మధ్యలో ప్రియమణి కల్పించుకుంటూ తాము ఈ బంధం చాలా సురక్షితంగా ఉన్నామని, ఏవేమనుకున్నా తమకు సంబంధం లేదని వెల్లడించింది. 

ప్రియమణి మాట్లాడుతూ "కమ్యూనికేషన్ కీలకం. నాకు, ముస్తఫా మధ్య ఉన్న సంబంధంలో మేము ఖచ్చితంగా చాలా సురక్షితంగా ఉన్నాము. ప్రస్తుతం అతను అమెరికాలో పని చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పటికీ మేము ప్రతిరోజూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాము. అలా కుదరకపోతే 'హాయ్' లేదా 'హలో' అని మెసేజ్ అయినా పెట్టుకుంటాము. అతను పనిలో బిజీగా ఉంటే ఫ్రీ అయ్యాక కాల్ చేస్తారు. లేదా టెక్స్ట్ చేస్తారు. నేను కూడా షూటింగ్ లో బిజీగా ఉంటే అలాగే చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. పలు అద్భుతమైన సినీమాల్లో నటించిన నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం నిజంగా ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ముస్తఫా, ప్రియమణి దంపతులు ఎప్పుడో అన్యోన్యంగా కన్పిస్తుంటారు. మరి ఆమె ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: