ప్రస్తుతం దక్షిణ భారత పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న తారలలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. దశాబ్ద కాలం నుంచి వెండితెరను ఏలుతున్న ఈ క్వీన్ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్ళు కునేలా మంచి గ్లామర్ తో ఇప్పటికీ ఏడాదికి ఐదు సినిమాల్లో నటిస్తోంది. స్టార్స్ ఫస్ట్ ఛాయిస్ నయనతార. సౌత్ లో అంతగా ఆమె హవా నడుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రానున్న భారీ ప్రాజెక్ట్ కోసం నయనతార ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం ధృవీకరించకపోయినా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అంటున్నారు. ఈ చిత్రంతో ఆమెకున్న సౌత్ స్టార్ హీరోయిన్ క్రేజ్ కాస్తా పాన్ ఇండియా రేంజ్ కు ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో నయన్ మరో సినిమాను మొదలెట్టేసింది. 

నూతన దర్శకుడు జిఎస్ విగ్నేష్ దర్శకత్వంలో నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్ఆర్ ప్రభు రూపొందించనున్నారు. తాజా సమాచారం ప్రకారం నయనతారసినిమా షూటింగ్ ప్రారంభించింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఆమె క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు. తాత్కాలికంగా'ప్రొడక్షన్ నెంబర్ 38' పేరుతో పొందుతున్న ఈ చిత్రానికి రాన్ ఏతాన్ యోహన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చివరిసారిగా ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన "మూకుట్టి అమ్మన్" అనే చిత్రంలో నయన్ కనిపించింది. ఇదిలా ఉండగా ఆమె నటించిన థ్రిల్లర్ మూవీ ' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్  రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 'అవల్' ఫేమ్ మిలింద్ రౌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇలా ఫుల్ జోష్ లో తగ్గేదే లే అంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది నయన్.

మరింత సమాచారం తెలుసుకోండి: