కాజల్ని పెళ్లి తర్వాత స్టార్ హీరోలు పక్కనపెట్టేశారు. పైగా 36 ఏళ్లు అని యంగ్స్టర్స్ ఎవరూ చందమామతో స్టెప్పులేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇక తమన్నా 31 ఏళ్ల వయసులోనూ మిల్కీగ్లామర్తో ఆకట్టుకుంటోంది గానీ.. అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. సీనియర్లు, యంగ్స్టర్స్ అంతా మిల్కీని పక్కనపెట్టేస్తున్నారు. అనుష్క, సమంత స్లో అయ్యాక పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరూ రేసులోకి దూసుకొచ్చారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నంబర్ వన్ ర్యాంక్ని టార్గెట్ చేశారు. అయితే టాప్ చైర్ కోసం పోటీపడ్డ వీళ్లిద్దరు హిందీలో బిజీ అవుతున్నారు. పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్ నుంచీ బాలీవుడ్ డ్రీమ్స్లోనే ఉంది. 'మొహంజదారో' టైమ్లో తెలుగు సినిమాలు తగ్గించి ముంబయికే పరిమితమైంది. పూజా హెగ్డేకి బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాక టాలీవుడ్కి వచ్చింది. ఇక్కడ వరుస సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు పూజాకి హిందీలో క్రేజీమూవీస్ ఉన్నాయి. సల్మాన్ ఖాన్తో కూడా కలిసి నటిస్తోంది. సో బాలీవుడ్ డ్రీమ్స్ నెరవేరుతున్నాయి కాబట్టి, పూజ తెలుగు సినిమాలని తగ్గిస్తుందని చెప్తున్నారు సినీ జనాలు.
రష్మిక మందన్న కూడా హిందీ మార్కెట్పై కాన్సన్ట్రేట్ చేస్తోంది. 'మిషన్ మజ్ను, గుడ్బై' లాంటి సినిమాలతో అక్కడ బిజీ అయ్యింది రష్మిక. పైగా ముంబాయిలో రష్మిక ఒక ఫ్లాట్ కూడా తీసుకుంది. దీంతో కన్నడ బ్యూటీ నార్త్లో సెటిల్ అయిపోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏర్పడింది.