సినిమాల్లో నటించే నటీనటులు ఇటీవల కాలంలో డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టడం మొదలు పెడుతున్నారు. ఇప్పటికే మన టాలీవుడ్ హీరోలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ తమ డబ్బును తిరిగి సంపాదించుకునేందుకు మంచి మంచి ప్రణాళికలు వేసుకున్నారు. ఈనేపథ్యంలోనే అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి వారు థియేటర్ బిజినెస్ లోకి రాగా కొంతమంది హీరోలు హోటల్ బిజినెస్ లోకి వచ్చారు.

హీరోయిన్ లు సైతం హీరోలలా ఆలోచిస్తూ సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే లాంటివారు మంచి మంచి హై క్లాస్ జిమ్ ఏర్పాటు చేసి ఆ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. ఇంకొంతమంది వస్త్ర రంగంలో లో కి అడుగు పెట్టి అక్కడ మంచి బిజినెస్ వుమేన్ గా పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా గతంలోలా హీరోహీరోయిన్ లు సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారాలు చేస్తూ మంచి బిజినెస్ మాన్ లో కూడా అవుతున్నారు. వారిలాగానే చెన్నైకు చెందిన హీరోయిన్ నయనతార కూడా వ్యాపారంలో  పెట్టుబడులు పెట్టడం ద్వారా బిజినెస్ రంగంపై తనకున్న ఆసక్తిని కనబరుస్తోంది.

తాజాగా నయనతార తాను కూడా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఖరారు చేసింది. చెన్నైకి చెందిన ఛాయ్ వ్యాపారంలో నయనతార పెట్టుబడులు పెడుతోందట. తమ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో నటి నయనతార డైరెక్టర్ విగ్నేశ్ శివన్ కూడా పెట్టుబడులు పెట్టారని ఫౌండర్ విధుర్ మహేశ్వరి ప్రకటించారు. ఏంజెల్ ఇన్వెస్టర్లు సునీల్ సాతియా, సునీల్ కుమార్ సింగ్వి,  మనీష్ మర్ధియ, యు ఎన్ ఐ - ఎమ్ నెట్వర్క్, ముంబై కి చెందిన ఎంజిల్ నెట్వర్క్ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్నారని ఆమె వివరించారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయినా బెంగళూరుకు చెందిన యుని లేస్తెడ్ ఎల్ ఎల్ పి, చెన్నై నుంచి మల్టీ ఫ్యామిలీ ఆఫీస్ నుంచి ఈ ఫండింగ్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఎక్స్ ప్లైన్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: