సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టి, తమ స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూ వుంటే, మరి కొంతమంది కేవలం సినిమాలు మాత్రమే కాదు ఫ్రెండ్ షిప్ కి కూడా ప్రాధాన్యం ఇస్తూ , తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక వారిలో ఒక స్నేహబంధం నయనతార, త్రిష అని చెప్పవచ్చు. వీరిద్దరూ కూడా ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లడం, కష్టసుఖాలను చెప్పుకోవడం , ప్రతి విషయంలోనూ నేనున్నాను అంటూ ఒకరికొకరు తోడు ఉండడం, మనం ఎన్నో సందర్భాలలో చూసే ఉంటాం. ఇద్దరు అందమైన హీరోయిన్ లు స్నేహబంధం తో ఒక్కటై, ప్రేక్షకులకు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కనువిందు చేస్తూ ఉంటారు.

ఇకపోతే నయనతార విషయానికి వస్తే, చూడడానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంది. ఈమె తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటించి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలో 100 మందిలో ఈమె కూడా స్థానం సంపాదించుకుంది. అంతేకాదు ఈమెకు లేడీ సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా అనే బిరుదు కూడా ఉంది. దాదాపు 75 చిత్రాలలో హీరోయిన్ గా నటించి,  ఒక స్టార్ హీరోయిన్ గా  తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ లో కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకుంది.

త్రిష కూడా మొదటగా మోడల్ గా తన వృత్తి ని మొదలు పెట్టి,  ఆ తర్వాత హీరోయిన్ గా  తన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.తెలుగు , తమిళ్ సినిమాలలో నటించి హీరోయిన్ త్రిష 1999లో మిస్ చెన్నై అవార్డును కూడా గెలుచుకుంది. ఇక తెలుగులో వచ్చిన వర్షం సినిమా ద్వారా ఉత్తమ తొలి తెలుగు నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దాదాపుగా ఎన్నో చిత్రాలలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా తన సొంతం చేసుకుంది..

ఇకపోతే వీరిద్దరూ ఒకరికంటే ఒకరు  ఎంతో ఇష్టంగా, స్నేహంగా ఉంటారు. సోషల్ మీడియా ద్వారా, అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఎంజాయ్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులలో సందడిని క్రియేట్ చేస్తూ ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: