టాలీవుడ్ లో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ పూజా హెగ్దే, రష్మిక మందన్నలకు మరో హీరోయిన్ ఆల్టర్నేట్ గా మారుతుంది ముంబై భామ నిధి అగర్వాల్. అక్కినేని బ్రదర్స్ తో జోడీ కట్టిన అమ్మడు ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫాం లోకి వచ్చింది. ఈ మూవీతో నిధి అగర్వాల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇస్మార్ట్ హిట్ తో నిధి అగర్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. అయితే తెలుగులో కన్నా అమ్మడికి తమిళంలో ఎక్కువ ఫాలోయింగ్ పెరిగింది.

కోలీవుడ్ లో నిధి అగర్వాల్ వరుస మూవీస్ తో దూసుకెళ్తుంది. అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ పై కూడా పూర్తి దృష్టి పెడుతుందని తెలుస్తుంది. టాలీవుడ్ లో కూడా కేవలం పూజా హెగ్దే, రష్మిక ఇద్దరు హీరోయిన్స్ పాపులర్ అవగా ఆ తర్వాత నిధి అగర్వాల్ పేరు వినపడాలని అనుకుంటుంది. అందుకే తెలుగులో క్రేజీ మూవీస్ మీద ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అశోక్ గల్ల హీరో మూవీలో నటిస్తున్న అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీలో కూడా నటిస్తుంది. పవన్ మూవీతో నిధి టాలీవుడ్ లో ఫుల్ ఫాం లోకి రావాలని చూస్తుంది. టాలీవుడ్ లో మిగతా హీరోయిన్స్ కు నిధి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది.

కేవలం మూవీస్ తోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా నిధి దుమ్ముదులిపేస్తుంది. తెలుగులో ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ అలాంటి హిట్ ఒక్కటి పడినా పూజా హెగ్దే, రష్మికల తర్వాత థర్డ్ ప్లేస్ ను తను ఆక్యుపై చేయాలని చూస్తుంది నిధి అగర్వాల్. అమ్మడు చేస్తున్న సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటో షూట్స్ కూడా ఆమెకు సూపర్ క్రేజ్ వచ్చేలా చేస్తున్నాయి. మరి అనుకున్నట్టుగానే నిధి ఆ టాప్ హీరోయిన్స్ ఇద్దరికి పోటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: