స్క్రీన్ ఏదైనా సరే తారక్ వన్స్ ఎంట్రీ ఇస్తే దుమ్ముదులిపేయడం పక్కా. బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ కాగా ఆ తర్వాత సీజన్లు తారక్ హోస్ట్ గా చేయడానికి కుదరలేదు. ఇక లేటెస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా తారక్ చేస్తున్నాడు. జెమిని లో టెలికాస్ట్ అవనున్న ఈ షో లేటెస్ట్ ప్రోమో నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ పై ఎన్.టి.ఆర్ ఎనర్జీని ఫ్యాన్స్ ఖుషి చేసుకుంటున్నారు. బుల్లితెర ప్రేక్షకులు కూడా చాలా గ్యాప్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ షో కోసం ఎక్సయిటింగ్ గా ఉన్నారు.
ఎవరు మీలో కోటీశ్వరులు లేటెస్ట్ ప్రోమోలో ఆట నాది కోటి మీది అన్న డైలాగ్ చెప్పి మీసం తిప్పుతాడు తారక్. ఆ ఒక్క షాట్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఏది ఏమైనా బుల్లితెర మీద కూడా తారక్ సందడి షురూ కానుంది. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్.టి.ఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి తారక్ ఉండాలంటే ఆ మాత్రం డిమాండ్ ఉండాల్సిందే కదా. ఈ షో ద్వారా రేటింగ్స్ లో వెనకపడ్డ జెమిని టీవీ తెలుగులో మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది. తారక్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి అది తప్పనిసరిగా జరిగుతుందని చెప్పొచ్చు.