జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి దోస్తీ సాంగ్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రిలీజైన ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో హేమచంద్ర ఆలపించిన దోస్తీ సాంగ్ ను కన్నడలో యాజిన్ నజీర్, మళయాళంలో విజయ్ ఏసుదాసు.. తమిళంలో అనిరుద్ రవిచంద్రన్.. హిందీలో టాలెంటెడ్ సింగర్ అమిత్ త్రివేది పాడటం విశేషం. ఈ పాటకు ఊహించిన దాని కన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్ తో మరోసారి ఆడియెన్స్ ను సినిమాకు ట్యూన్ అయ్యేలా చేశారు.

ఆర్.ఆర్.ఆర్ దోస్తీ సాంగ్ బాలీవుడ్ లో ట్రెన్మండస్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ సాంగ్ అలా రిలీజైందో లేదో ఇలా వైరల్ గా మారింది. అక్కడ అమిత్ త్రివేది ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ దోస్తీ సాంగ్ మీద సూపర్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సాంగ్ గురించి హిందీలో అప్పుడే విశ్లేషణలు కూడా మొదలు పెట్టారు. సూపర్ లిరిక్స్, సూపర్ సింగింగ్.. సూపర్ మ్యూజిక్ అంటూ టీం అందరిని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కీరవాణి ఆల్ మ్యూజిక్ ట్రూప్ తో చేసిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

ఒక్క పాటతోనే ఆర్.ఆర్.ఆర్ మీద అంచనాలు పెంచేశాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ మూవీకి దోస్తీ సాంగ్ మంచి స్టార్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఏది ఏమైనా రాజమౌళి సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ప్రతి సినిమాకు ఆయా తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మరో బాహుబలి కాదు అంతకుమించిన మూవీ అయ్యేలా రికార్డుల దుమ్ముదులిపేయడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సాంగ్ విన్న బాలీవుడ్ స్టార్స్ కూడా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మీద ఓ కన్నేసి ఉంచినట్టు తెలుస్తుంది. మొత్తానికి బాలీవుడ్ ఆడియెన్స్ కు మళ్లీ ట్రిపుల్ ఆర్ దోస్తీ సాంగ్ తో సూపర్ కిక్ ఇచ్చారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: