సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ ఘట్టమనేని ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చింది. పరశురాం చెప్పినట్టుగానే మహేష్ బొమ్మ అదిరిపోయేలా ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ మూవీతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం డైరక్షన్ లో కూడా ఒక మూవీ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట పూర్తి అవడమే ఆలస్యం త్రివిక్రం మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న త్రివిక్రం మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని అంటున్నారు.

ఇక ఈ మూవీని త్వరలో స్టార్ట్ చేసి మూడు నెలల్లో మిగించాలని చూస్తున్నారు. ఆల్రెడీ 2022 సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ఇక ఇప్పుడు త్రివిక్రం కాంబోలో వస్తున్న మూవీని కూడా 2022 సమ్మర్ టార్గెట్ చేసుకున్నారని తెలుస్తుంది. త్రివిక్రం కోసం మహేష్ 3 నెలలు మాత్రమే కేటాయిస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. త్రివిక్రం మూవీతో పాటుగా మరో మూవీ కూడా చేయాలని ఆలోచనల్లో ఉన్నాడట సూపర్ స్టార్.

2022 సమ్మర్ కి ఆల్రెడీ ప్రభాస్ సలార్ ఖర్చీఫ్ వేసేశాడు. 2022 ఏప్రిల్ లో సలార్ గా ప్రభాస్ గర్జించడానికి వస్తున్నాడు. అదే నెలలో కొరటాల శివ, ఎన్.టి.ఆర్ కాంబోలో వస్తున్న మూవీ కూడా వస్తుంది. ఆ మూవీ రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ అని ప్రకటించారు. సో ప్రభాస్, తారక్ లతో పాటుగా 2022 సమ్మర్ రేసులో కూడా మహేష్ ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు. రాజమౌళి మూవీకి ముందు సాధ్యమైనంత త్వరగా మూవీస్ చేయాలని చూస్తున్న మహేష్ త్రివిక్రం తో పాటుగా మరో స్టార్ డైరక్టర్ తో మూవీ చేస్తాడని తెలుస్తుంది. కమిటైన మూవీస్ అన్ని పూర్తి చేసుకుని జక్కన్న మూవీకి రెండేళ్లు కేటాయించే ప్లాన్ లో ఉన్నాడు సూపర్ స్టార్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: