యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్మాల్ స్క్రీన్ పై చేస్తున్న మరో కొత్త రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు. త్వరలో జెమిని టీవీలో ఈ షో టెలికాస్ట్ అవనుంది. ఆట నాది కోటి మీది అంటూ ప్రోమోతోనే షో మీద ఆసక్తి పెంచేశాడు ఎన్.టి.ఆర్. ఇక ఈ షోలో తారక్ ను డైరెక్ట్ చేసింది ఎవరు అన్నది తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ షో కోసం సెట్ వేశారు. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షోని ముఖ్యంగా ఎన్.టి.ఆర్ పార్ట్ ను షూట్ చేసింది డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ అని తెలుస్తుంది.

కింగ్ నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా మూవీ డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణమూవీ తర్వాత నేల టిక్కెట్టు అని రవితేజతో డిజాస్టర్ మూవీ చేశాడు. ఆ మూవీ తర్వాత డైరక్టర్ అడ్రెస్ లేకుండా పోయాడు. నాగార్జునతో సోగ్గాడే మూవీ ప్రీక్వల్ గా బంగార్రాజుని డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ అవబోతుందని తెలుస్తుంది. ఎలాగు ఖాళీనే కదా అని రియాలిటీ షోని డైరెక్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ.

ఎన్.టి.ఆర్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోని కొంత పార్ట్ ఎన్.టి.ఆర్ డైరెక్ట్ చేస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ షో ప్రోమోలన్నిటిని త్రివిక్రం డైరక్షన్ లో షూట్ చేశారని తెలుస్తుంది. బిగ్ బాస్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న స్మాల్ స్క్రీన్ షో కాబట్టి ఎవరు మీలో కోటీశ్వరులు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ షోతో మరోసారి తారక్ తన సత్తా చాటనున్నాడని చెప్పొచ్చు. స్క్రీన్ ఏదైనా యంగ్ టైగర్ రంగం లోకి దిగితే రచ్చ కన్ఫర్మ్ అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ ఆర్.ఆర్.ఆర్ తో అదరగొట్టడానికి రెడీ అవగా ఈ మూవీ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో మూవీ ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: