మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ ఉప్పెనతోనే సంచలనాలు సృష్టించాడు. బుచ్చి బాబు డైరక్షన్ లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో బెంగుళూరు భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించి మెప్పించింది. మొదటి మూవీతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ భామ కృతి శెట్టి వరుస అవకాశాలతో దుమ్ముదులిపేస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ క్రిష్ డైరక్షన్ లో పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీకి జంగిల్ బుక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు టాక్. క్రిష్ డైరక్షన్ లో మూవీ రిలీజ్ కు సిద్ధం కాగా ఈ మూవీకి అమేజాన్ ప్రైం నుండి ఫ్యాన్సీ వచ్చినట్టు టాక్. ఈ మూవీకి డైరెక్ట్ ఓటీటీ ఆఫర్లు చాలా వచ్చాయని టాక్. అయితే థియేటర్ లో రిలీజ్ చేసే ఉద్దేశంతోనే క్రిష్ వైష్ణవ్ తేజ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయలేదని టాక్. అయితే థియేట్రికల్ రిలీజ్ అయినా సరే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా అమేజాన్ ప్రైం సూపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మూవీ బడ్జెట్ కూడా తక్కువే కాగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తోనే మూవీ సగానికి పైగా బడ్జెట్ కవర్ అయినట్టు తెలుస్తుంది. క్రిష్ మూవీలో వైష్ణవ్ తేజ్ కు జతగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట క్రిష్. ప్రస్తుతం క్రిష్ పవర్ స్టార్ తో హరి హర వీరమల్లు మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కెరియర్ లో హరి హర మూవీ ప్రత్యేకంగా నిలిచేలా ఉంటుందని చెబుతున్నారు. క్రిష్ బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోల మూవీస్ తో తన సత్తా చాటాలని చూస్తున్నారు. మరి క్రిష్ మూవీస్ ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: