కన్నడ భామ రష్మిక మందన్న టాలీవుడ్ ఓ సూపర్ క్రేజ్ తో దూసుకెళ్తుంది. ఛలో తో నాగ శౌర్య జతగా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ఆ మూవీ హిట్ అవడం ఆ వెంటనే విజయ్ దేవరకొండతో చేసిన గీతా గోవిందం కూడా సెన్సేషనల్ హిట్ అవడంతో తెలుగులో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. కేవలం తెలుగు సినిమాలతోనే ఆమె నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. నేషనల్ క్రష్ గా కూడా అవార్డ్ అందుకుంది. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న రష్మిక మందన్న శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో రష్మిక పాత్ర వెయిట్ ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది.

స్టార్ హీరోయిన్ గా రష్మిక తనకు ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా రఫ్ఫాడించేస్తుంది. ఈ క్రమంలో కిశోర్ తిరుమల చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. అందుకే మూవీలో రష్మిక పాత్ర శర్వానంద్ పాత్రని కూడా డామినేట్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. సినిమాలో అలనాటి తారలు ఖుస్భు, రాధికలు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యన్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుండి బయటకు వచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శర్వానంద్, రష్మిక జోడీ కడుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే మంచి మూవీగా తెరకెక్కిస్తున్నారట కిశోర్ తిరుమల. మూవీలో రష్మిక మందన్న మరోసారి తన నటనతో మెప్పిస్తుందని చెబుతున్నారు. శర్వానంద్ కూడా ఈ మూవీ మీద ఫుల్ ఫోకస్ తో ఉన్నాడని టాక్. ఈ మూవీతో పాటుగా అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం మూవీ చేస్తున్నాడు శర్వానంద్. ఈ రెండు మూవీస్ తో శర్వానంద్ మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: