స్టార్ హీరోయిన్ గా రష్మిక తనకు ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా రఫ్ఫాడించేస్తుంది. ఈ క్రమంలో కిశోర్ తిరుమల చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. అందుకే మూవీలో రష్మిక పాత్ర శర్వానంద్ పాత్రని కూడా డామినేట్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. సినిమాలో అలనాటి తారలు ఖుస్భు, రాధికలు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యన్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుండి బయటకు వచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శర్వానంద్, రష్మిక జోడీ కడుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే మంచి మూవీగా తెరకెక్కిస్తున్నారట కిశోర్ తిరుమల. మూవీలో రష్మిక మందన్న మరోసారి తన నటనతో మెప్పిస్తుందని చెబుతున్నారు. శర్వానంద్ కూడా ఈ మూవీ మీద ఫుల్ ఫోకస్ తో ఉన్నాడని టాక్. ఈ మూవీతో పాటుగా అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం మూవీ చేస్తున్నాడు శర్వానంద్. ఈ రెండు మూవీస్ తో శర్వానంద్ మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.