టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'.ఈ సినిమాలో అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.సినిమాలో అర్హ శకుంతల,దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో కనిపించనుంది.ఇక ఇప్పటికే దాదాపు 10 రోజుల షూటింగ్ లో పాల్గొన్న అర్హ..తాజాగా మళ్ళీ ఈ సినిమా షూటింగ్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.దానికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఇక శ మహాభారత గాథ లోని ఆదిపర్వంలో ఉన్న అందమైన ప్రేమకథ ఆధారంగా శాకుంతలం సినిమాను రూపొందిస్తున్నారు.

ఇక ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహనన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు.ఇక పాన్ ఇండియా లెవల్ లో గుణశేఖర్ తన సొంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.ఇక శాకుంతలం సినిమా కంటే ముందే దగ్గుబాటి రానాతో హిరణ్య కశ్యప అనే భారీ సినిమాను తీయాలనుకున్నాడు గుణ శేఖర్.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.దాంతో మరో చారిత్రాత్మక సినిమాగా శాకుంతలం ప్రాజెక్ట్ ను మొదలు పెట్టాడు.ఇక శాకుంతలం పాత్రకు సమంత కంటే ముందు అనుష్క ను సెలెక్ట్ చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆమె స్థానంలో సమంత వచ్చి చేరింది.ఇక ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సెట్స్ లోనే తాజా షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.ఇక ఇప్పటికే రుద్రమదేవి వంటి చారిత్రాత్మక సినిమాతో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న గుణశేఖర్ శాకుంతలం సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు.ఇక తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఇక సినిమాని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!



మరింత సమాచారం తెలుసుకోండి: