మెగాస్టార్ చిరంజీవి.. యువ హీరోలతో పోటీ పడుతూ.. ఆరు పదుల వయసులో కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతున్నాడు. ఈయన కుర్ర హీరోలలాగే ఒకే సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, చిరంజీవి అప్పట్లో ఎలా ఉండేవారో, అంతకంటే ఎక్కువ జోష్ తో ఇప్పుడు సినిమాలో నటిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఈయన రాజకీయ జీవితాన్ని కొంతవరకు ముగించిన తరువాత ఖైదీనెంబర్150 సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సైరా సినిమా తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఇక ప్రస్తుతం తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుండగా ,ఈ సినిమా అతి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.
సినిమా తరువాత మలయాళం సినిమా లూసీఫర్ లో కూడా నటించడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఇక దీనికి బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాదు వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న మెహర్ రమేష్ కి కూడా ఇక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరొక్క ప్రాజెక్టును చేయడానికి సిద్ధమయ్యారు చిరు. ఇక ఆయనలో ఉన్న క్రేజ్ ను,  ఎనర్జీని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రస్తుతం మరో కామెడీ డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇక  అతను ఎవరో కాదు మారుతి.

మారుతి మొదటి నుంచి చిరంజీవి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇక అందుకే మారుతికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చిరంజీవి ఆలోచించినట్లు సమాచారం. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు , లోగో విషయంలో కూడా మారుతి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని , మారుతితో మరొక ప్రాజెక్ట్  చేయడానికి చిరంజీవి సిద్ధమయ్యారు..


మరింత సమాచారం తెలుసుకోండి: