తెలుగు చిత్ర పరిశ్రమలో సోషల్ మీడియాలో హీరోలతో పాటు వారి కుమారులు, కుమార్తెలకు కూడా అదే స్థాయిలో అభిమానులు ఉంటున్నారు. ఇక స్టార్ హీరోల పిల్లలు సితారతో పాటు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు సోషల్ మీడియాలో మంచి పాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు అదే స్థాయిలో రచ్చ చేస్తున్నారు.

కాగా.. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ.. గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’లో భరతుడుగా తెరంగేట్రం చేయనుంది. అంతేకాక.. మరోవైపు ఎన్టీఆర్ తనయులు కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాగా.. వీళ్ల బాటలో మరికొంత మంది హీరోల తనయులు, కూతుళ్లు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.

ఇక ఇప్పటికే మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘నేనొక్కడినే’ సినిమాలో బాల నటుడిగా నటించారు. అలాగే మహేష్ కూతురు సితార ’సర్కారు వారి పాట’లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ .. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘శాకుంతలం’లో చిన్నారి భరతుడి పాత్రలో నటించబోతుంది. ఇక మంచు లక్ష్మీ తన కూతరు విద్యా నిర్వాణకు అహం బ్రహ్మాస్మి’లో ఓ పాత్రలో నటించనున్నారు.

అయితే దుల్కర్ సల్మాన్ నాలుగేళ్ల కూతురు మరియం కూడా దుల్కర్ నటించే సినిమాతో తెరంగేట్రం చేయనున్నది. ఇక కేజీఎఫ్ స్టార్ యశ్ కూతురు కూడా సోషల్ మీడియలో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక ఈమె బాలనటిగా పరిచయం కాబోతున్నట్టు శాండిల్‌వుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ధనుష్ కుమారులు లింగ, యాత్ర ఇద్దరు కూడా ఇప్పటికే పలు సినిమాల్లో బాల నటులుగా నటించారు. ఎన్టీఆర్ ఇద్దరు తనయులు అభయ్ రామ్, భార్గమ్ రామ్‌లకు సోషల్ మీడియాలో పాలోయింగ్ ఉంది. ఇక ఎన్టీఆర్ చిన్న తనయులు భార్గవ్ రామ్ ..’ఆర్ఆర్ఆర్’లో చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: