నయనతార.. ఈమె అసలు పేరు డయానా మరియమ్ కురియన్.. ప్రముఖ కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు, మలయాళం, చిత్రాలలో కూడా నటించింది. అంతేకాదు ఈమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని కూడా చేసింది. 2018 వ సంవత్సరం ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో తన పేరును నమోదు చేయించుకున్న మొట్టమొదటి దక్షిణ భారతీయ నటిగా కూడా గుర్తింపు పొందింది.అందుకే నయనతారను మహిళ సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియన్ అని కూడా పిలుస్తూ ఉంటారు.


ఇక ఈమె దాదాపుగా 75 చిత్రాలలో నటించి తెలుగు, మలయాళం , తమిళ చిత్రాలకు గాను ఎన్నో నంది అవార్డులతో పాటు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్న నటిగా గుర్తింపు పొందినది. ఈ మధ్య కాలంలో నయనతార పెళ్లి, ప్రేమ విషయాలపై ఎప్పటికప్పుడు వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అంతకుముందు ప్రభుదేవాతో ప్రేమలో పడి డేటింగ్ కూడా చేసింది. ఇక ప్రభుదేవాకు మొదటి భార్య ఉంది. నయనతార కారణంగా ఆమె ప్రభుదేవాకు దూరం అయింది. అంతేకాదు ప్రభుదేవా కోసం నయనతార తన మతాన్ని కూడా మార్చుకుంది. కాకపోతే ప్రభుదేవా రిస్ట్రిక్షన్స్ , రూల్స్  అంటూఎక్కువ పెట్టడం వల్ల ఆమె తట్టుకోలేక ప్రభుదేవాకు దూరమై అయిందని సమాచారం.

కొంతకాలం తర్వాత తిరిగి సహనటుడు శింబుతో కూడా ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఇతనితో కూడా బ్రేకప్ చెప్పేసి ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు విగ్నేష్ తో ప్రేమాయణం నడుపుతోందని అనే వార్తలు వచ్చాయి.  కానీ ఈ విషయాన్ని ఏ ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఆమె ఇంతకు ముందు ఇద్దరితో ప్రేమాయణం నడిపి , పెళ్లి పీటల వరకు వెళ్ళకుండానే బ్రేకప్ చెప్పేసింది. కానీ ఈసారి మాత్రం తను నిజంగా ప్రేమించిందని, ఎంగేజ్మెంట్ కూడా అయిందని,  పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్లు తాను ఒక ప్రముఖ తమిళ ఛానల్ కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన వేలికి తొడిగిన ఉంగరం చూపించి, తనకు ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిపింది

 "నేను రౌడీ నే "..విగ్నేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార నటించింది. ఈ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. విగ్నేష్ కూడా నయనతారకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. మా పెళ్లి కి డబ్బులు సమకూర్చుకుంటున్నాము  అని కూడా తెలియజేశాడు. ఇక త్వరలోనే ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: