పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది ప్రియమణి. వాస్తవానికి ప్రియమణి హీరోయిన్ గా చేసే రోజుల్లో కంటే ఇప్పుడు చాలా బిజీ గా ఉంది అని చెప్పవచ్చు. ఎవరే అతగాడు సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈమె తమిళ మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమిళనాడులో కార్తి నటించిన పరుత్తి వీరన్ సినిమా కు ఆమెకు నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో ఆమె ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఆమెకు రావడం మొదలయ్యాయి.

ఆ విధంగా దక్షిణాదిన ఆమెకు తిరుగులేకుండా సినిమా అవకాశాలు వచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఆమె ఎదగలేక పోయింది. ముఖ్యంగా తెలుగునాట ఆమె మీడియం రేంజ్ హీరోయిన్ గా మిగిలిపోయింది. క్రమంగా ఆమె కు సినిమా అవకాశాలు తగ్గక తప్పలేదు. ఆమె కు పేరు తెచ్చిన పెళ్లయిన కొత్తలో సినిమా టైం లో పెళ్ళైన హీరో తో అఫైర్ అనే వార్తలు రావడం ఆమె అభిమానులను ఎంతో ఇబ్బంది కలిగించింది. ఓ పెళ్లి అయిన హీరో తో నాకు ఎఫైర్ అంటగట్టడం ఏంటి అని ఆమె అప్పటి మీడియాలో ఫైర్ అయ్యింది కూడా.

గోలీమార్ చిత్రంలో ఆమె చేసిన నటనకు ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. బుల్లితెరపై ఓ డాన్స్ షోలో జడ్జిగా టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె వెండితెర పై కూడా మంచి పాత్రలతో దక్కించుకుంటుంది. ఇటీవలే వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా లో ఆమె హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ముగ్ధులై పోయారు. ఇకపోతే విరాటపర్వం సినిమాలో కూడా ఆమె ఓ కీలక పాత్ర చేస్తుంది. అంతే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషలలో సైతం ఆమెకు వరస సినిమా అవకాశాలు వస్తున్నాయి.  చూస్తుంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: